- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం : భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు తోడుగా స్థానికంగా నాలుగు రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో నీటిమట్టం 48.7 అడుగులకు చేరుకుంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. మోటారు బోట్లు, […]</p>

దిశ ప్రతినిధి, ఖమ్మం : భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు తోడుగా స్థానికంగా నాలుగు రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో నీటిమట్టం 48.7 అడుగులకు చేరుకుంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు.
మోటారు బోట్లు, స్పీడ్ బోట్లు.. స్టీమర్లతో గోదావరి నదిలో ప్రయాణించవద్దని.. అలాగే వరద నీటిలో ఈతకు.. స్నానాలకు వెళ్లడం చేయరాదంటూ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలం వద్ద స్నానపు ఘాట్లను వరదనీరు ముంచెత్తడంతో ఎవరూ ఇటు వైపు రావద్దంటూ దూరం నుంచే వెనక్కి పంపుతున్నారు. పోలీస్ సిబ్బందిని కూడా అక్కడ నియమించారు. ముంపు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో సహాయానికి విపత్తుల నిర్వహణ శాఖ ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను పంపింది.






