- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ను బుధవారం రెండో విదేశీ రాయబారుల బృందం సందర్శించింది. ఇందులో జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, అప్ఘనిస్థాన్, గల్ఫ్ దేశాలకు చెందిన 25 మంది రాయబారులు ఉన్నారు. అధికరణం 370 ద్వారా జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా, ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ నిషేధాజ్ఞాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో పరిస్థితి ఎలా ఉందో పరిశీలించడానికి రెండో విదేశీ రాయబారుల బృందం వచ్చింది. ఈ బృందం మొదట ఉత్తర కశ్మీర్లో పండ్ల ఉత్పత్తిదారులతో సమావేశమవుతుంది. ఆ తర్వాత శ్రీనగర్ చేరుకుని అక్కడ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల, రాజకీయ నాయకులతో భేటీ అవుతుంది. జమ్ముకశ్మీర్లో భద్రతాపరమైన అంశాలపై రాయబారులకు భారత సైన్యం సంక్షిప్తంగా వివరించనుంది.
Next Story