వాలంటీర్లకు ఎన్నికలు విధులు అప్పగించొద్దు :ఎస్ఈసీ

by  |
nimmagadda
X

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతి ఎన్నికల విధులను ఎట్టిపరిస్థితుల్లోనూ వాలంటీర్లకు అప్పగించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల సన్నాహకం నేపథ్యంలో బుధవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సినేషన్ ఆగకూడదని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను స్వాగతించండని తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా ఎన్నికలు తీసుకోండని సూచించారు. కలెక్టర్లు కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే కేంద్ర బలగాలు వస్తాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఓ ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని.. గొడవలు, అసాంఘీక చర్యల సమాచారాన్ని పౌరులు ఈ యాప్ ద్వారా పంపొచ్చని వెల్లడించారు.


Next Story

Most Viewed