మిషన్ కాకతీయకు‘ స్కోచ్’ అవార్డ్

by  |
‘Scotch’ Award
X

దిశ, తెలంగాణ బ్యూరో : మిషన్ కాకతీయ కార్యక్రమానికి స్కోచ్​అవార్డు లభించినట్లు ఇరిగేషన్​శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. చెరువుల పునరుద్ధరణ జరిగిన తర్వాత చెరువులు అన్నింటినీ ఆన్​లైన్‌‌లో పర్యవేక్షించడానికి సాగునీటి శాఖ తయారు చేసిన సాఫ్ట్​వేర్ పనితీరుకు ఈ అవార్డు వచ్చినట్టు ఇంజనీర్లు స్పష్టం చేశారు. దీన్ని ఆన్​లైన్​వేదికగా ఈఈ రామాచారి అవార్డును స్వీకరించారు. చీఫ్​ఇంజినీర్ అనిల్ కుమార్, ఈఈ రామాచారి నేతృత్వంలో ఆ సాఫ్ట్​వేర్‌ను తయారు చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మిషన్​కాకతీయకు రెండు స్కోచ్​అవార్డులు వచ్చాయి. 2018లో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్, పవర్ ఆధ్వర్యంలో బెస్ట్​వర్కింగ్​కేటగిరీలో మిషన్ కాకతీయకు ఈ అవార్డును ప్రకటించారు.

Next Story