జీతం అడిగితే.. అశ్లీల వీడియోలు తీశారు

by  |
జీతం అడిగితే.. అశ్లీల వీడియోలు తీశారు
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో జీతాల్లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు అండగా నిలవాల్సిన స్కూల్ యాజమాని, అతడి కొడుకు కోరిక తీర్చాలంటూ పైశాచికత్వానికి తెగబడ్డారు. స్కూల్‌ రన్ అవుతున్న సమయంలోనే టాయిలెట్స్‌లో స్పై కెమెరాలు అమర్చారు. ఆ తర్వాత ఉపాధ్యాయుల అశ్లీల వీడియోలను సేకరించారు. అవే వీడియోలను చూస్తూ కామవాంఛ తీర్చుకొవడమే కాకుండా.. జీతాలు అడిగినందుకు వీడియోలను చూపి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర‌ప్రదేశ్‌లో కలకలం రేపింది.

ఉత్తర‌ప్రదేశ్‌ మీరట్‌లోని సర్దార్ బజార్‌లో రంజీత్‌ జైన్‌ అనే వ్యక్తి ‘రిషబ్ అకాడమీ స్కూల్’ నడుపుతున్నాడు. లాక్‌డౌన్‌తో మొత్తం విద్యా సంస్థలు మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో టీచర్ల ఆర్థిక పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. అయితే, తమకు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అదే పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. పాఠశాల గేట్ ఎదురుగా దీక్ష చేపట్టారు.

వారి అవసరాల పై హామీ ఇవ్వాల్సిన రంజీత్ జైన్ అతడి కొడుకు ఇదే అదును చూసి కోరిక తీర్చుకోవాలనుకున్నారు. ఉపాధ్యాయుల అశ్లీల వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. స్పై కెమెరాల భాగోతం బయటపడింది. టాయిలెట్స్‌లో కెమెరాలు పెట్టి అశ్లీల వీడియోలను సేకరించినట్టు వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.



Next Story

Most Viewed