పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా జయమ్మ..

by  |
పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా జయమ్మ..
X

దిశ, పాలేరు : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కూసుమంచి మండలం చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టి. జయమ్మ ఎన్నికయ్యారు. ఆమె ఎన్నిక పట్ల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.నాగేశ్వరరావు, ఎస్.ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జయమ్మను పలువురు అభినందించగా.. ఆమె మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోత్కూరి మధు గారికి, రంగారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పీఆర్టీయూ అభివృద్ధి కోసం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Next Story