నీటిలో తేలే ఏటీఎమ్.. ఎక్కడంటే ?

by  |
sbi-atm
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శ్రీనగర్‌లోని దాల్ సరస్సుపై ఫ్లోటింగ్ ఏటీఎమ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పర్యాటకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిలో తేలే ఏటీఎమ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 16న ఈ ఫ్లోటింగ్ ఏటీఎమ్‌ను ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు.

పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండే శ్రీనగర్‌లో మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు ఎస్‌బీఐ ఈ ఫ్లోటింగ్ ఏటీఎంను తీసుకొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. దాల్ సరస్సులోని హౌస్‌బోట్‌లో ఈ ఏటీఎం ఉందని, ప్రజలు ఎప్పటినుంచో దీనికోసం ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు. దాల్ సరస్సుపై ఇప్పటికే నీటిలో తేలియాడే కూరగాయల మార్కెట్, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. కాగా, భారత్‌లో మొట్ట మొదటిసారిగా కొచ్చిలో ఫ్లోటింగ్ ఏటీఎంను ఎస్‌బీఐ ఏర్పాటు చేసింది.



Next Story

Most Viewed