- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఎస్బీఐ వినియోగదారుల కోసం గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా తీసుకునే ప్రయోజనాలను కల్పిస్తున్నట్టు బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా..’ఈ ఏడాది దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున గృహ రుణాలపై సున్నా ప్రాసెసింగ్ ఫీజును అందించడం ద్వారా మీ కలల ఇంటిని సొంతం చేసుకోండి’ అని ఎస్బీఐ తెలిపింది.
ఎస్బీఐ ఖాతాదారులు తీసుకునే గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదని, అలాగే, ఎస్బీఐలోని మహిళా ఖాతాదారుల్కు 5బీపీఎస్ అంటే 0.05 శాతం వడ్డీ రాయితీ అందిస్తున్నట్టు పేర్కొంది. అలాగే, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఖాతాదారులకు 5బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుందని బ్యాంకు వివరించింది. కాగా, ప్రస్తుతం ఎస్బీఐ ఖాతాదారులకు 6.7 శాతం వడ్డీతో గృహ రుణాలు పొందవచ్చని వెల్లడించింది.