మాస్కులు కుట్టిన ప్రథమ మహిళ

by  |
మాస్కులు కుట్టిన ప్రథమ మహిళ
X

భారత ప్రథమ మహిళ సవితా కోవింద్ కరోనాపై పోరులో తనవంతు పాత్ర పోషించారు. రాష్ట్రపతి భవన్‌లోని శక్తి హాత్ వద్ద స్వయంగా ఆమె బుధవారం కుట్టు మిషన్‌పై ఫేస్ మాస్క్‌లు కుట్టారు. వీటిని ఢిల్లీలోని వివిధ ప్రదేశాల్లో అశ్రయం పొందుతున్న నిరాశ్రేయులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా కరోనాపై పోరులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తోంది. గురువారం ఉదయం నాటికి 20,471 నమోదవ్వగా, 652 మంది మృత్యువాత పడ్డారు. మరో 3960 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

Tags: prasident wife savitha kovind, masks, carona, rastrapathi bavan



Next Story

Most Viewed