అప్పటివరకూ కరోనా పూర్తిగా తగ్గాలి దేవుడా..

by  |
అప్పటివరకూ కరోనా పూర్తిగా తగ్గాలి దేవుడా..
X

దిశ, మహబూబాబాద్: రైతు వేదిక ప్రారంభం నాటికి కరోనా పూర్తిగా తగ్గాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతి మడుగులో బుధవారం రైతు వేదిక నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు బాగుండాలి, వ్యవసాయం పండుగ కావాలని సీఎం కేసీఆర్ రైతు వేదికల నిర్మాణం చేపట్టారన్నారు. కరోనా విజృంభిస్తోందని అందరూ జాగ్రత్తగా ఉండి క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ, మాస్క్‌లు, భౌతికదూరం పాటిస్తూ ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలు చేపడుతున్నామని, అయినా ప్రజల సహకారమే ముఖ్యమన్నారు.r


Next Story

Most Viewed