పెంచిన ధరలను తగ్గించకపోతే రాష్ట్రంలో ఆందోళనలు తప్పవు..

by  |
congress
X

దిశ, కూకట్​పల్లి: పెరిగిన గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ ​చేస్తూ.. చేవెళ్లలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి చేపడుతున్న పాదయాత్రలో కూకట్​పల్లి కాంగ్రెస్​ నాయకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొన్నారు. అనంతరం సత్యం శ్రీరంగం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో ధరల నియంత్రణ చేయలేకపోయాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని అన్నారు.

Next Story