సత్య నాదెళ్ల సతీమణి ఔదార్యం

by  |
సత్య నాదెళ్ల సతీమణి ఔదార్యం
X

దిశ, ఏపీ బ్యూరో: రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రూ.2కోట్ల విరాళం ప్రకటించి ఔదార్యం చూపారు. అనంతపురం యాక్షన్‌ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఆదివారం ఈ విరాళాన్ని అందజేయగా.. జిల్లా కలెక్టర్‌ అనుపమ నాదెళ్లను అభినందించారు. దాతలు ఇచ్చిన ఆర్ధిక సాయంతో రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ వైవీ మల్లారెడ్డి పేర్కొన్నారు.


Next Story

Most Viewed