సివిల్స్ ఫలితాల్లో యాదాద్రి వాసికి 218 ర్యాంకు

by  |
సివిల్స్ ఫలితాల్లో యాదాద్రి వాసికి 218 ర్యాంకు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో చౌటుప్పల్ మండలం తంగడపల్లి వాసి సత్తా చాటాడు. గ్రామానికి చెందిన బడేటి సత్య ప్రకాష్ గౌడ్ 218 ర్యాంక్ సాధించాడు. బడేటి అశోక్, వసంత దంపతుల కుమారుడు సత్య ప్రకాష్ గౌడ్. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు. ఐఐటీ పాట్నాలో బీటెక్ ను 2018‌లో పూర్తి చేశాడు. అప్పటి నుంచి సివిల్ పరీక్షలకు ఇంట్లో ఉండే ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలో సివిల్స్ రాసిన మొదటి ప్రయత్నంలోనే 218 ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఐపీఎస్ సాధించి మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తానని అన్నారు.

Next Story

Most Viewed