దళితులకు న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తా : బద్దం నిర్మల

by  |
దళితులకు న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తా : బద్దం నిర్మల
X

దిశ, కల్లూరు(తల్లాడ): తల్లాడ మండల పరిధిలో రెడ్డిగూడెం కొడవటిమెట్ట రెవెన్యూ లో దళితులు గత 30సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములలో అనుమతి లేకుండా వైరా మున్సిపాలిటీ అధికారులు చెత్త డంపింగ్ యార్డ్ గా వాడుతున్నారని సర్పంచ్ బద్దం నిర్మల అన్నారు. నిరుపేదలైనటువంటి దళితులకు పట్టాలిప్పించేవరకు అండగా ఉంటానని, ఈ భూముల్లో చెత్త డంపింగ్ ఆపేవరకు మా రిలే నిరాహారదీక్షలు జరుగుతూనే ఉంటాయి అన్నారు. మాట వినని పక్షంలో నా రాజీనామాకైనా సిద్దంగా ఉన్నానని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 కుటుంబాల రైతులు పాల్గొన్నారు.



Next Story