పంచాయితీ కార్యాలయంలో అంబేద్కర్ వర్దంతి..

by  |
పంచాయితీ కార్యాలయంలో అంబేద్కర్ వర్దంతి..
X

దిశ, నూగురు వెంకటాపురం: మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిడెం.యామిలి, పంచాయతీ సిబ్బంది, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చిడెం యామిలి మాట్లాడుతూ.. విశ్వ రత్న డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దేవుడని, ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed