యాదాద్రికి మేము సైతం.. భారీ విరాళం ఇచ్చిన యువ సర్పంచ్..

by  |
యాదాద్రికి మేము సైతం.. భారీ విరాళం ఇచ్చిన యువ సర్పంచ్..
X

దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి దేవాలయ గోపురానికి బంగారు తాపడం కోసం సీఎం కేసీఆర్, భక్తులు నుంచి విరాళాలు కోరిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆలయ అధికారులు భక్తుల నుండి విరాళాలు సేకరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, వడాయిగూడెం గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్-సంతోషిని తన తల్లిదండ్రులు టియూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య-రాధ గౌడ్ తో కలిసి 1,00,116 రూపాయల విరాళాన్ని ఆలయ ఈఓ గీతారెడ్డి కి అందజేశారు.

అనంతరం శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేశారు. అలాగే కూకట్ పల్లి కి చెందిన ప్రదీప్తా 50,000రూపాయల విరాళం అందజేశారు.



Next Story

Most Viewed