‘సర్కారు వారి పాట’కు సితార ఫస్ట్ క్లాప్

by  |
‘సర్కారు వారి పాట’కు సితార ఫస్ట్ క్లాప్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కార్ వారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు సితార ఘట్టమనేని క్లాప్ ఇవ్వగా, నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మూవీ యూనిట్.. జనవరి మొదటి వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది.

అమెరికా షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుండగా, దాదాపు రెండు నెలల పాటు కొనసాగనుంది. మహేశ్ బాబు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో స్వీటీ అనుష్క శెట్టి కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఖలేజా’ తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండగా.. స్వీటీ బ్యాంక్ ఆఫీసర్‌గా కనిపించనుందని టాక్. ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాకు మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్ కాగా.. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్, ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

Next Story