సారాతో కలిసి గంజాయి సేవించా : హీరోయిన్

by  |
సారాతో కలిసి గంజాయి సేవించా : హీరోయిన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫస్ట్ డెత్ యానివర్సరీ దగ్గరలోనే ఉండగా.. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అతని ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పితానిని అదుపులోకి తీసుకోవడం ద్వారా కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలోనే సుశాంత్ లవర్ రియా చక్రవర్తి (Rhea Chakraborty)ఎన్సీబీకి ఇచ్చిన స్టేట్‌మెంట్ వెలుగులోకి వచ్చింది. సైఫ్, అమృతా సింగ్‌ల కూతురు సారా అలీఖాన్‌తో (Sara Ali Khan) తన ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పిన రియా.. సారా వద్ద గంజాయి చుట్టలు ఉండేవని, బ్యాడ్ హ్యాంగోవర్ నుంచి రిలీఫ్‌నిస్తాయని చెప్తూ.. తమకు కూడా ఆఫర్ చేసిందని చెప్పినట్టు ఎన్సీబీ చార్జ్ షీట్‌లో పేర్కొంది. కాగా 2017లో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న వీరిద్దరూ ఒకే జిమ్‌లో వర్కవుట్ చేసేవారని, ఈ క్రమంలోనే తనతో కలిసి గంజాయి షేర్ చేసుకున్నట్టు ఒప్పుకుంది.

2018-19 సమయంలో లేట్ సుశాంత్ సింగ్‌తో (Sushant Singh Rajput) సారా డేటింగ్‌లో ఉందని ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడి కాగా, 2018లో థాయ్‌లాండ్‌కు వెళ్లిన సుశాంత్.. ఫ్రెండ్స్ కోసం 70 లక్షలు ఖర్చు చేశాడని రియా తెలిపింది. అప్పుడు సారా కూడా వీరితోనే ఉన్నట్టు చెప్పింది. అయితే ‘కేదార్‌నాథ్’ షూటింగ్ టైమ్‌లోనే సుశాంత్ గంజాయి సేవించాడని, సారానే తనకు అలవాటు చేసిందని పేర్కొంది. ఈ లెక్కన కొండ ప్రాంతాల్లో సీన్లు చిత్రీకరిస్తున్నప్పుడు మూవీ టీమ్ కూడా గంజాయి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న రియా.. ‘బైకులా’ జైలు నుంచి నెలరోజుల తర్వాత బయటకు రాగా, ప్రస్తుతం సారా కూడా తన మూవీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయింది.

Next Story