సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభం

by  |
సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: దేశం కోసం వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. సూర్యాపేటలోని విద్యానగర్ నుంచి ఆర్మీ ప్రత్యేక వాహనంలో సంతోష్ బాబు అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆర్మీ ప్రత్యేక వందనం సమర్పించింది. సూర్యాపేటకు పక్కనే ఉన్న కేసారం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగనున్నది. కేసారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా ఆర్మీ లాంఛనాల ప్రకారం సంతోష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున సంతోష్ బాబు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అయితే.. కరోనా దృష్ట్యా అంత్యక్రియలు జరిగే చోట 50 మందికి మాత్రమే ఆర్మీ అనుమతించింది.

Next Story