వెళ్లిపోతున్నా ముంబై.. మళ్లీ కలుస్తానో లేదో!

by  |
వెళ్లిపోతున్నా ముంబై.. మళ్లీ కలుస్తానో లేదో!
X

– సుశాంత్‌సింగ్ హీరోయిన్ భావోద్వేగ ట్వీట్

‘మన సినిమాను.. థియేటర్లో చూడాలనే నీ కోరికను ప్రతిక్షణం, ప్రతిరోజు నేను చదివాను’ అని దిల్ బచారే హీరోయిన్ సంజన సాంఘి ఇటీవలే ఓ భావోద్వేగమైన పోస్ట్‌ను తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. సుశాంత్ సింగ్‌తో చివరగా కలిసి నటించిన నటి సంజన. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఇటీవలే ముంబై పోలీసులు సంజనను విచారించారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఢిల్లీలో ఉన్న ఈ నటి.. పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ముంబై వచ్చింది. బుధవారం తిరిగి ఢిల్లీకి వెళ్లింది. అయితే, ముంబైని వీడి వెళ్తున్న సందర్భంలో ఆమె.. ఇన్‌స్టాగ్రాంలో ఓ భావోద్వేగమైన పోస్ట్ చేసింది.

సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూ.. ‘కాలం గాయాలను మాన్పుతుందని ఎవరన్నారో కానీ అది అబద్ధం. ఆ గాయం మళ్లీ మళ్లీ మనసును గాయపరుస్తుంది. బాధ పెరుగుతూనే ఉంటుంది’ అంటూ ఇన్‌స్టాలో ఆమె పెట్టిన పోస్ట్.. తను ఎంత భావోద్వేగానికి గురైందో తెలిపేందుకు నిదర్శనం. సుశాంత్ మరణం నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు. ఆమె ముంబై నుంచి ఢిల్లీ వెళ్తూ.. ‘బై.. ముంబై, నిన్ను చూడటానికి నాకు నాలుగు నెలలు పట్టింది. నేను తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతున్నాను. నీ వీధులన్నీ కాస్త కొత్తగా కనిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్నాయి. నాలోని బాధ వల్లే నా దృష్టి కోణం కూడా మారిందేమో! లేదంటే నువ్వు కూడా బాధలో ఉండి ఉండొచ్చు, మళ్లీ కలుద్దాం.. లేదంటే ఇక కలవలేవమేమో’ అంటూ ముంబై నగరాన్ని ఉద్దేశించి సంజన భావోద్వేగానికి లోనయ్యారు.

సంజన డెబ్యూ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ‘దిల్‌ బెచారా’ సినిమా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిస్నీ హాట్‌స్టార్‌లో జులై 24న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed