బస్సుల్లో నో ​మాస్క్.. నో ఎంట్రీ

by  |
Sanitize buses
X

దిశ, తెలంగాణబ్యూరో : కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్​ఆర్టీసీ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డిపోల నుంచే బయటకు వెళ్లే ప్రతి బస్సును శానిటైజ్​చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రతి ట్రిప్పుకు బస్సుల లోపల సీట్లను శానిటైజ్​చేస్తున్నారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ శానిటైజ్​ కార్యక్రమాన్ని ఉన్నతాధికారులే పర్యవేక్షిస్తున్నారు. అదే విదంగా కండక్టర్లు, డ్రైవర్లకు రెండుచొప్పున శానిటైజ్​ బాటిళ్లు, తాత్కాలిక మాస్క్​లను అందిస్తున్నారు.

అంతేకాకుండా మాస్క్​ లేకుంటే బస్సుల్లోకి నో ఎంట్రీ అంటూ ప్రయాణీకులను బస్సుల్లోకి రానీయడం లేదు. ఒక వేళ కచ్చితgగా వస్తే కండక్టర్ల దగ్గర తాతాల్కికంగా ఏర్పాటు చేసిన మాస్క్​లను కొనుగోలు చేసుకోవాల్సి ఉండేలా కొన్ని డిపోల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సిటీ బస్సుల్లో రద్దీ కూడా తగ్గింది.


Next Story

Most Viewed