వింబుల్డన్‌లో సానియా జోడి శుభారంభం

by  |
వింబుల్డన్‌లో సానియా జోడి శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్: వింబుల్డన్ 2021లో భారత జోడీ సానియా మీర్జా-రోహన్ బోపన్న శుభారంభం చేశారు. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇండియాకే చెందిన రామ్‌కుమార్-అంకిత రైనా జోడీతో తలపడి గెలుపొందారు. ఇరు జోడీలు గంటకు పైగా తలపడ్డాయి. తొలి సెట్‌లో రామ్‌కుమార్-అంకిత రైనా కాస్త తడబడ్డా.. రెండో సెట్‌లో పోరాడారు.

కానీ సానియా-బోపన్న అనుభవం ముందు తలొంచక తప్పలేదు. సానియా జోడీ 6-2, 76 తేడాతో ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించారు. ఈ జోడి ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్ మహత్, క్రిస్టీనా లాడెనోవిక్‌తో తలపడనున్నారు. కాగా, గురువారం సానియా మీర్జా మహిళ డబుల్స్‌లో అలెక్సా గువారచి, డెసిరే క్రాజిక్ జోడీపై 7-5, 6-3 తేడాతో గెలుపొందారు. ఒలింపిక్స్‌లో భారత్ తరపున సానియా మీర్జా-అంకిత రైనా జోడి పాల్గొననున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed