అభివృద్ధిపై ఆరా.. సర్పంచ్‌ను సత్కరించిన కలెక్టర్

by  |
sangareddy additional collector visits chitkul & praises sarpanch
X

దిశ, ప‌టాన్ చెరు: ప‌టాన్ చెరు మండల ప‌రిధిలోని చిట్కుల్ గ్రామంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా అదనపు క‌లెక్టర్ రాజ‌ర్షి షా ప‌ర్యటించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో జ‌రిగిన అభివృద్ధి ప‌నుల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. శివునిగుట్ట, నర్సరీ, డంపుయార్డు, క్రిమిటోరియం, చిట్కుల్ గ్రామ రోడ్ల ఇరువైపులా చెట్లు త‌దిత‌ర అభివృద్ధి ప‌నుల‌ను గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్, ఎంపీడీఓ బ‌న్సీలాల్‌, ఎంపీఓ రాజులతో క‌ల‌సి అదనపు కలెక్టర్ ప‌ర్యటించారు.

అదే విధంగా గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు గుర్తించిన పది ఎకరాల స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంత‌రం గ్రామంలో జ‌రిగిన అభివృద్ధిపై ఆయ‌న సంతృప్తి వ్యక్తం చేశారు. చిట్కుల్ గ్రామ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న స‌ర్పంచ్ నీలం మ‌ధును వారు స‌త్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఓ క‌విత‌, ఉప స‌ర్పంచ్ విష్ణు వ‌ర్థన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, ఆంజనేయులు, శ్రీనివాస్, మురళి, ఎన్‌ఎంఎం యువసేన స‌భ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed