మా కుటుంబంలో వేలు పెట్టొద్దు : సంచైత

by  |
మా కుటుంబంలో వేలు పెట్టొద్దు : సంచైత
X

దిశ ఏపీ బ్యూరో: తమ కుటుంబ వ్యవహారాల్లో తల దూర్చదంటూ సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచైత గజపతి రాజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ట్విట్టర్ వేదికగా ఘాటు హెచ్చరిక చేశారు. ట్విట్టర్‌లో ఆమె.. ‘‘నేను సంచయిత గజపతి. మా తాత మహరాజా పీవీజీ రాజు పెద్ద కుమారుడు, చట్టబద్ధమైన వారుసుడైన నా తండ్రి ఆనంద గజపతికి చట్టబద్దమైన వారసురాలిని. అశోక్‌ గజపతిలాగా చంద్రబాబు కూడా లింగ వివక్ష చూపించరని ఆకాంక్షిస్తున్నా.. గజపతి వంశానికి తానొక్కడినే వారసుడిని అని, నేను అనగా (సంచైత) ఇక లేదు అన్నట్లుగా అశోక్‌ గజపతి మిమ్మల్ని కూడా తప్పుదోవ పట్టించారనుకుంటున్నా.. ఇక మీదట గజపతి కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంటే బాగుంటుంది. రాజకీయం చేయాలని చూడొద్దు అంటూ ’’ సంచైత ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed