రజాలిపేటలో దారుణం.. యువకుడి స్కిన్ ఊడిపోయేలా కొట్టి చంపారు

by  |
రజాలిపేటలో దారుణం.. యువకుడి స్కిన్ ఊడిపోయేలా కొట్టి చంపారు
X

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రజాలిపేట గ్రామానికి చెందిన ఓ యువకుడిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు శనివారం దాడి చేశారు.ఈ ఘటనలో సదరు యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపాలిటీ శివారు రజాలిపేటకు చెందిన నక్క ప్రభాకర్ అలియాస్ బాబు(28) సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ప్రభాకర్ మద్యం సేవించి రజాలిపేట గ్రామంలో గొడవ చేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు.

ఈ దాడిలో ప్రభాకర్ విద్యుత్ స్తంభానికి కట్టేసి ఉండగానే మృతి చెందాడు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు.ఆదివారం పోస్టుమార్టం చేసే క్రమంలో ప్రభాకర్ ఒంటి పై, బీర్జాలపై గాయాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు ప్రభాకర్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని కురవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాణాప్రతాప్ తెలిపారు. కాగా, ప్రభాకర్‌ను విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా గాయపరచడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తుండటం గమనార్హం.


Next Story

Most Viewed