‘మా ఇద్దరిదీ అదే బ్యాక్‌గ్రౌండ్’

by  |
‘మా ఇద్దరిదీ అదే బ్యాక్‌గ్రౌండ్’
X

దిశ, వెబ్‌డెస్క్: కిరణ్ అబ్బవరం, చాందిని హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కె. ప్రవీణ నిర్మిస్తుండగా.. హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా విచ్చేయగా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాగా ఈ నెల 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలిపిన మూవీ యూనిట్.. అనుకున్న టైమ్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సినిమా తమకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని, మూడేళ్ల నుంచి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు హీరో కిరణ్ అబ్బవరం. తనలాగే చాందిని కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచే బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిందని.. తనతో కలిసి ఈ బ్రిలియంట్ ప్రాజెక్ట్ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ‘సమ్మతమే’ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed