చైతన్యతో విడాకులు.. సీరియస్ అయిన సమంత.. బుద్ధి ఉందా? అంటూ

by  |
చైతన్యతో విడాకులు.. సీరియస్ అయిన సమంత.. బుద్ధి ఉందా? అంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారిని దర్శించుకున్న సమంతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇకపోతే ప్రస్తుతం ఆమెపై కొన్ని రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. భర్త నాగ చైతన్యతో విభేదాలు, కోర్టులో విడాకులు అంటూ సోషల్ మీడియా లో పుకార్లు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఈ విషయమై సామ్, చై ఎక్కడ కనిపించిన మీడియా వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. తాజాగా శ్రీవారి సేవలో ఉన్న సామ్ ని కూడా ఒక జర్నలిస్ట్ ఇదే విషయం అడిగేసరికి సామ్ ఫైర్ అయ్యింది.

దర్శనానంతరం ఆమె బయటకు రాగానే మీడియా ఆమెను చుట్టుముట్టింది. ‘మీ గురించి కొన్ని రూమర్లు వస్తున్నాయి’ అంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నను అడగబోతుండగా మధ్యలోనే సమంత చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. “స్వామి వారి దర్శనం చేసుకుని వస్తున్న ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? బుద్ధి ఉందా? అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో జర్నలిస్ట్ అవాక్కయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు సైతం సామ్ కి సపోర్ట్ చేస్తున్నారు .. ” వీరికి ఎప్పుడు, ఏ ప్రశ్న అడగాలో తెలియదు” అంటూ ఫైర్ అవుతున్నారు. ఇకపోతే ఈ సమయంలో సామ్ శ్రీవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తమ సినిమా విడుదలయ్యే కొద్దీ రోజుల ముందు సామ్ స్వామివారిని దర్శించుకోవడం అలవాటన్న విషయం అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ఈ నెల 24 న విడుదల కానున్న నేపథ్యంలో సామ్ శ్రీవారిని దర్శించుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. భర్త సినిమా సూపర్ హిట్ కావాలనే సమంత స్వామివారిని మొక్కుకొందని అభిమానులు గుసగుసలాడుతోన్నారు. ఒక పక్క విడాకుల గురించి స్పందించకుండా.. మరోపక్క భార్యాభర్తలిద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం బట్టి అసలు వీరిమధ్య విభేదాలు ఉన్నాయా..? అవన్నీ నిజంగానే రూమార్సా..? అనే అనుమానం వస్తోందని కొందరు అంటున్నారు. మరి ఈ పుకార్లకు చెక్ ఎప్పుడు పెడతారో ఈ అక్కినేని జంట వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed