దీపావళి వేళ మరోసారి వార్తల్లో నిలిచిన Smanatha.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by  |
దీపావళి వేళ మరోసారి వార్తల్లో నిలిచిన Smanatha.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ. చాలా మంది దీపావళి పండుగంటే ఇష్టపడుతుంటారు.. ఇక పిల్లలైతే రెండు మూడు రోజుల ముందు నుంచే దీపాలను కాల్చడం మొదలు పెడుతారు. కొత్త బట్టలు, పిండి వంటలతో పల్లెల్లో పండుగవాతవరణం చూస్తే రెండు కళ్లు చాలవు. అయితే ఇప్పుడు జరుగుతున్న దీపావళి పండుగ చూస్తే ఆనాటి వాతావరణం కనిపిచడంలేదు. టపాసులను నిషేధించి పర్వావరణాన్ని పరిరక్షించాలనే మాట చాలా సంవత్సరాలుగా వినిపిస్తోంది. బ్యాన్ క్రాకర్స్ అనే నినాదంతో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో చాలా పట్టణాలల్లో టపాసుల కాల్చడం నిషేదించారు. దీంతో పిల్లలు ఆటలు.. ఆనందాలకు బ్రేక్ పడింది. పిల్లలు సంతోషంగా టపాసులు కాల్చడం లేదు.. అసలు పండుగ వాతావరణం కనిపిచడం లేదు.

Anchor Sreemukhi : పొట్టి స్కర్టులో పిచ్చెక్కించిన యాంకర్ శ్రీముఖి.. వావ్ అనాల్సిందే..

అయితే ఈ టపాసులు కాల్చకూడదు అనే విషయంపై సమంత స్పందించిది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే సామ్ పండుగ వేళ తనదైన శైలిలో ఆసక్తికర పోస్టు చేసింది. ఇషా ఫౌండేషన్ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ట్వీట్‌కు సామ్ సంఘీభావం తెలిపింది. పండుగ సమయంలో పిల్లలను ఆనందంగా టపాసులు కాల్చుకోని వ్వాలి అంటూ సోషల్ మీడియా వేదికగా సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. వాయికాలుష్యం పై ఆందోళ చెందుతున్న వారికి నేను ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తున్నాను. ఈసారికి మీరు టపాసులు కాల్చడం మానేసి.. మీ పిల్లలను కాల్చనివ్వండి. అంతేకాదు.. మీ ఆఫీసుకు కారులో కాకుండా. మూడు రోజులు నడిచి వెళ్లండి..” అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. అయితే సద్గురు ట్వీట్‌‌కు సమంత మద్దతు నిచ్చింది. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ తీర్థయాత్రలు చేస్తూ అన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సద్గురు మాట్లాడిన మాటలను తన ఇన్‏స్టా స్టోరీల పోస్ట్ చేస్తూ డోంట్ బ్యాన్ క్రాకర్స్ అంటూ కామెంట్ చేసింది.



Next Story

Most Viewed