'శాకుంతలం' ను మొదలుపెట్టేసిన అక్కినేని కోడలు

by  |
శాకుంతలం ను మొదలుపెట్టేసిన అక్కినేని కోడలు
X

దిశ, వెబ్ డెస్క్:పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది అక్కినేని కోడలు సమంత. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే ‘ఓ బేబీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సామ్ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాను మొదలుపెట్టేసింది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శాకుంతలం’. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్, గుణ టీం వర్క్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న మేకర్స్ తాజాగా ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమాకోసం వేసిన భారీ సెట్ లో ‘శాకుంతలం’ పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఇక ఈ చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మైథలాజికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుండి ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్ట్ లోకి హిట్ చిత్రాల ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా జాయిన్ కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో అక్కినేని కోడలు మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

Next Story