సెలూన్ షాపుల స్వచ్ఛంద బంద్

by  |
సెలూన్ షాపుల స్వచ్ఛంద బంద్
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనా విజృంభిస్తుండడంతో నాయీ బ్రాహ్మణ సంఘం ఈ నెల 31 వరకు సేలూన్ షాపులు మూసివేయాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం డ్యాక్యూ‌మెంట్ రైటర్లు కూడా లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున తామీ నిర్ణయం తీసుకున్నామని డాక్యూమెంట్ రైటర్లు ప్రకటించారు. వీరికి స్టాంప్ వెండర్లు మద్దతు పలికారు. జగిత్యాలలో ఇప్పటికే వస్త్ర వ్యాపారులు ప్రతిరోజు సాయంత్రం ఆరుగంటల లోపే షాపులను మూసివేస్తున్నారు.



Next Story

Most Viewed