- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: దేశీయ దిగ్గజ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన ‘టీవీఎస్ స్కూటీ’ విభాగంలో 50 లక్షల విక్రయాల మైలురాయిని చేరుకున్నట్టు మంగళవారం వెల్లడించింది. టీవీఎస్ స్కూటీ దశాబ్దాలుగా భారతీయ వినియోగదారుల ఆదరణను కలిగి ఉంది. గేర్లెస్ వాహనాల విభాగంలో చాలాకాలం నుంచి స్థిరమైన మార్కెట్ను కొనసాగిస్తోంది. ఈ స్కూటీ మోడల్ ప్రారంభమైనప్పటి నుంచి ఐకానిక్ వాహనంగా ఉందని, మూడు దశాబ్దాలకు పైగా దేశంలోని మహిళలకు మెరుగైన ఎంపికగా ఉందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ మోడల్ను మార్కెట్లోకి తెచ్చిన తర్వాత రెండేళ్లలో మహిళలు ఎక్కువగా ఈ స్కూటర్ను కొన్నారు. ఈ మార్పును గమనించి మహిళల కోసమనే దీన్ని రీమోడలైజ్ చేసి ఎప్పటికప్పుడు మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా ప్రయాణీకుల నుంచి ఆదరణను పొందామని కంపెనీ వివరించింది. టీవీఎస్ స్కూటీ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో పాటు కంఫర్ట్ రైడింగ్, ఈజీ స్టాండ్ టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకుంటోందని కంపెనీ పేర్కొంది. మైలేజ్ పరంగా కూడా 15 శాతం మెరుగైన మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.