యాదాద్రికి చేరిన సాలహార విగ్రహాలు

by  |
యాదాద్రికి చేరిన సాలహార విగ్రహాలు
X

దిశ, ఆలేరు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ప్రధాన ఆలయానికి సంబంధించిన సాలహార విగ్రహాలు మంగళవారం ఉదయం యాదాద్రికి చేరాయి. 350 విగ్రహాలకు గాను రెండో విడతలో 15 విగ్రహాలు తీసుకొచ్చారు. మరో 150 విగ్రహాలు త్వరలో వస్తాయని అధికారులు వెల్లడించారు. తూర్పు ద్వారానికి పక్కన ఉన్న సాలాహారాలలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో కొన్ని ఆళ్వారులు, అమ్మవారు, ఆంజనేయ స్వామి ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి.

Next Story

Most Viewed