ఇంటర్ విద్యార్థులకు సజ్జనార్ బంపర్ ఆఫర్

by  |
Sajjanar-125
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీని వినియోగించుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా హైదరాబాద్ జోన్ పరిధిలో బస్ పాస్ కలిగిన విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపించి ఉచితంగా బస్‌లో ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ తెలిపింది. అయితే, రూట్ పాస్ కలిగి ఉన్నా కూడా పరీక్ష కేంద్రం ఎక్కడున్నా వెళ్లొచ్చని టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఉన్నతాధికారి వెంకటేశ్వర్లు ప్రకటనలో తెలిపారు.

Next Story

Most Viewed