దటీజ్ సజ్జనార్ : వారందరికీ బస్సులో ఫ్రీ ప్రయాణం

by  |
TS RTC MD Sajjanar
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, ప్రహరి ట్రస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసేవారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికీ రేపు(మంగళవారం) ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మరింత మంది రక్తదానం చేసేందుకు ముందుకు వస్తారని ఆర్టీసీ ఆశిస్తోంది. కొవిడ్ కారణంగా గత ఏడాదిన్నరగా రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని.. బ్లడ్ డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed