‘తిరుపతిలో దొంగ ఓట్లు.. టీడీపీ డ్రామా’

by  |
‘తిరుపతిలో దొంగ ఓట్లు.. టీడీపీ డ్రామా’
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంటే.. దొంగఓట్ల పేరుతో టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అసత్య ప్రచారానికి తెరలేపారన్నారు. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినయోగించుకుంటున్నారని.. శాంతి భద్రతలకు ఆటంకం కలుగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. కానీ, టీడీపీ నేతలు అర్ధరాత్రి పూట ఈసీకి లేఖలు రాయడం ఏంటని.. నకిలీ ఓట్లతో డ్రామాలు చేయడం ఎందుకని సజ్జల రామకృష్ణ ప్రశ్నించారు.


Next Story

Most Viewed