సజ్జల షాకింగ్ కామెంట్స్.. ‘రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో కేసీఆర్‌ పేరు’

by  |
సజ్జల షాకింగ్ కామెంట్స్.. ‘రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో కేసీఆర్‌ పేరు’
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీలో సంచలనం రేపుతున్న వేళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాట్ కామెంట్లు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌, సుజనా చౌదరితో చర్చలు జరిపినా రఘురామ.. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతేడాదిగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రభుత్వంపై విద్వేషం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఎంపీని వాడుకుంటున్నారని.. రఘురామకృష్ణంరాజు చేస్తున్న కుట్రలకు ఆధారాలు కూడా ఉన్నాయని సజ్జల చెప్పుకొచ్చారు. ఆయన అరెస్ట్ రాత్రికి రాత్రే జరిగిన విషయం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే సీఐడీ అధికారులు సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని.. ఎక్కడా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదన్నారు. కానీ, గతంలో (చంద్రబాబు హయాంలో) కేసీఆర్‌పై 12 సార్లు రాజద్రోహం కేసులు పెట్టారని.. కేసీఆర్ మీద కేసులు పెట్టినప్పుడు అది రాజకీయం అనిపించలేదా అంటూ సజ్జల ప్రశ్నించారు. గుంటూరులో లాయర్లు మీటింగ్‌లు పెట్టినప్పుడు కూడా వారిపైనా రాజద్రోహం కేసులు పెట్టారని చంద్రబాబును ఉద్దేశిస్తూ సజ్జల విమర్శలు చేశారు. ప్రస్తుతం టీడీపీ నాయకులు రఘురామకు మద్దతు ఇస్తూ.. కాళ్లకు గాయాలు అంటూ కొత్త ఎపిసోడ్ మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed