హెలికాప్టర్ ప్రమాదం.. రేపు సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు!

by  |
హెలికాప్టర్ ప్రమాదం.. రేపు సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : హెలికాప్టర్ ప్రమాదంలో మరో ఆరుగురు సైనిక అధికారుల మృతదేహాలను డిఫెన్స్ అధికారులు గుర్తించారు. వాటిలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ, వివేక్ కుమార్‌తో పాటు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మరో నలుగురి మృతదేహాలు ఉన్నట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో శనివారం విమానంలో వారి పార్థివదేహాలను అధికారులు వారి స్వస్థలాలకు పంపించనున్నారు. రేపు (ఆదివారం) వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Next Story

Most Viewed