ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సాయికృష్ణ

by  |
ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సాయికృష్ణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్వీబీసీ ఛానల్‌కు ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పదవిలో రెండేళ్ల పాటు యాచేంద్ర కొనసాగనున్నారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన సాయికృష్ణ.. 1985లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019ఎన్నికల నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్న సాయికృష్ణను ప్రస్తుతం ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.


Next Story

Most Viewed