'సర్కార్ వారి పాట'కు ఫ్రెష్ ఫేస్

by  |
సర్కార్ వారి పాటకు ఫ్రెష్ ఫేస్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త చిత్రం ‘సర్కార్ వారి పాట’. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలైలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం హీరోయిన్ వెతుకులాటలో ఉంది మూవీ యూనిట్. స్ట్రాంగ్ మెస్సేజ్‌తో మాస్ ఎంటనర్టైనర్‌గా తెరకెక్కుతున్న మూవీకి… కియారా అద్వాని ఫైనల్ అయిందని టాక్ వచ్చింది. దీంతో భరత్ అను నేను సినిమా కాంబినేషన్ రిపీట్ అవుతుందని భావించారు అంతా. కానీ, ఇప్పుడు ఇదంతా ఫేక్ న్యూస్ అని తెస్తుంది. మహేష్ సరసన ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్నట్లు సమాచారం ఉండగా… మరో బాలీవుడ్ ఫేస్ ప్రచారంలోకి వచ్చింది. తాజాగా సయీ మంజ్రేకర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఈ దబాంగ్ 3 హీరోయిన్ తను ఫైనల్ అవుతుందా..? ‘ సర్కారు వారి పాట’ హీరోయిన్ వెతుకులాట ఇక్కడితో ముగుస్తుందా చూడాలి.


Next Story

Most Viewed