సైదాబాద్ నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డ్ : సీపీ

by  |
accused Raju
X

దిశ,డైనమిక్ బ్యూరో : సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి హత్యచార కేసులో నిందితుడైన రాజును పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే వంద మంది పోలీసులతో హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల్లో గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే తాజాగా నిందితుడు రాజును పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రకటించారు. ఇప్పటికే రాజు ఫొటోని విడుదల చేయగా.. తాజాగా అతడి ఎత్తు 5.9 అంగులాలు, దాదాపు 30 ఏళ్ల వయసు కలిగి ఉంటాడని తెలిపారు. నిందితుడు ఎక్కడ కనిపించినా 9490616366, 9490616627 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సీపీ స్పష్టం చేశారు. ఆ పిచ్చి కుక్కను పట్టుకొని నడిరోడ్డుపై కాల్చి చంపాలి


Next Story

Most Viewed