- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: మలార్ బ్యూటీ సాయిపల్లవి కెరీర్లో తనదైన మార్క్తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో కంటెంట్ ఉన్న పాత్రలకే ఓటేస్తూ కమిట్మెంట్ ఉన్న హీరోయిన్గా గుర్తింపు పొందింది. తెలుగులో ‘ఫిదా’ సినిమాలో పర్ఫార్మెన్స్తో అవర్ వెరీ ఓన్ సాయిపల్లవి అనిపించేసిన బ్యూటీ.. డైరెక్టర్ శేఖర్ కమ్ములపై ప్రశంసల వర్షం కురిపించింది. శేఖర్ కమ్ముల తనపై ఎంతలా ప్రభావం చూపారంటే.. సమాజాన్ని, జీవితాన్ని చూసే కోణమే మారిపోయేలా చేశారన్నారు. లైఫ్లో ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే ధైర్యం ఇచ్చారని తెలిపింది సాయి పల్లవి.
కాగా సాయి పల్లవి ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ‘విరాటపర్వం’లో కీలక పాత్ర చేస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో టైటిల్ కార్డ్స్లో సాయి పల్లవి పేరునే తన పేరు కన్నా ముందు వేయించారు రానా. మరోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ కంప్లీట్ చేయగా.. విడుదలకు సిద్ధంగా ఉంది.