- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్:
టాలీవుడ్ సింగిల్ కింగ్లు ఒక్కొక్కరుగా మింగిల్ అయిపోతున్నారు. రానా దగ్గుబాటి, నిఖిల్, నితిన్ ఇప్పటికే పెళ్లి పీటలు ఎక్కగా.. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వారిని ఫాలో అయ్యే పనిలో ఉన్నాడు. కానీ వీళ్లు ముగ్గురు లవ్ మ్యారేజ్ చేసుకుంటే, తను మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు.
తేజ్.. తనకు పెళ్లి కూతురిని వెతికే పనిని తల్లికే అప్పగించగా ఆంధ్రాలో మంచి సంబంధం సెట్ చేసినట్టు తెలుస్తోంది. తేజ్ మేనమామ, మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ సంబంధం నచ్చడంతో ఫైనల్ చేశారని టాక్. మొత్తానికి మ్యాచ్ సెట్ అయిపోగా త్వరలో దీనిపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉన్న తేజ్.. ఇన్నాళ్లూ సింగిల్ లైఫే బెస్ట్ అని, ఇప్పుడిలా చేస్తున్నాడేంటని ఫీల్ అయిపోతున్నారు ఫ్యాన్స్. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి? అంటూ త్వరలో పెళ్లికి రెడీ అవుతున్న మెగా మేనల్లుడికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
కాగా, మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక కొణిదెల నిశ్చితార్థం ఈ మధ్యే జరగ్గా.. ఇప్పుడు తేజ్ ఎంగేజ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.