వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన తేజ్

by  |
వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన తేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడలో సందడి చేశారు. వాంబే కాలనీలో తను నిర్మించిన ‘అమ్మ ప్రేమ ఆదరణ’ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆశ్రమ ఫౌండర్ నారాయణ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన తేజు.. వృద్ధులతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. గతేడాది పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమం కట్టించి, ఏడాది పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకుంటానన్న ఈ మెగా హీరో.. ఇచ్చిన మాట ప్రకారం అన్ని వసతులతో కూడిన ఆశ్రమాన్ని అందించారు. షూటింగ్ నిమిత్తం విజయవాడ చేరుకున్న సాయిధరమ్.. ఈ క్రమంలోనే ఆశ్రమాన్ని సందర్శించగా మెగా అభిమానులు తరలివచ్చారు.

Next Story