సాయిధరమ్ తేజ్ కోసం అక్కడ పూజలు చేయించిన ఫ్యాన్స్..

by  |
fans
X

దిశ, ఏపీ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మెగా మీరో సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో సాయిధరమ్ తేజ్ అభిమానులు మోకాళ్లపై మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. మెగాహీరో ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని ప్రార్థించారు. సాయిధరమ్ తేజ్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

మరోవైపు విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయంలోనూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు రాజమహేంద్రవరంలోని ఓ దేవాలయంలోనూ అభిమానులు పూజలు చేశారు. తమ హీరో త్వరగా కోలుకుని మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరారు.



Next Story

Most Viewed