సదాశివ నగర్ ఎంపీఓ సస్పెన్షన్..

by  |
సదాశివ నగర్ ఎంపీఓ సస్పెన్షన్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పల్లె ప్రగతి పనులను సరిగ్గా పర్యవేక్షణ చేయనందుకు, హరితహారం మొక్కలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల పంచాయతీ అధికారి లక్ పతి నాయక్‌ను శనివారం సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బందిని సమన్వయం చేయకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎంపీవో‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Next Story

Most Viewed