దేవీ శ్రీ ప్రసాద్ ఇంట్లో తీరని విషాదం..

by  |
దేవీ శ్రీ ప్రసాద్ ఇంట్లో తీరని విషాదం..
X

దిశ, సినిమా : రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన బాబాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. సోదరుడి మరణ వార్తతో దేవి శ్రీ మేనత్త గుండెపోటుతో మరణించారు. దీంతో గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ ప్రముఖులు వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కాగా, దేవి శ్రీ తండ్రి చనిపోయినప్పుడు.. ఆయనకు అంకితమిస్తూ నాన్నకు ప్రేమతో ఆల్బమ్ చేశాడు. ఇక దేవి తెలుగులో ప్రస్తుతం పుష్ప, ఖిలాడీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.



Next Story

Most Viewed