శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిది

by  |
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిది
X

దిశ, ఎల్బీనగర్: దేశం కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి సామ రంగారెడ్డి అన్నారు. మంగళవారం చంద్రపురి కాలనీలోని పార్టీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే చట్టం అనే నినాదంతో జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్ దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. దేశంలో కాశ్మీర్ కూడా అంతర్భాగమేనంటు పోరాటం చేస్తూ ఆత్మబలిదానం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్త రవీందర్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, రామేశ్వర్, నూతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed