బీజేపీలో చేరికపై.. సచిన్ పైలట్ క్లారిటీ

by  |
బీజేపీలో చేరికపై.. సచిన్ పైలట్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ సర్కారుపై తిరుగుబావుట ఎగురవేసిన సచిన్ పైలట్.. బీజేపీలో చేరే అంశంపై క్లారిటీ ఇచ్చారు. తనకు బీజేపీలో చేరే ఉద్దేశం లేదని ఓ జాతీయ మీడియాలో పేర్కొన్నారు. అయితే తిరుగుబావుట ఎగురవేయడంతో సచిన్ ను.. డిప్యూటీ సీఎం పదవితోపాటు, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లోత్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని, ఆ తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టాలని ఆ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోంది. మొత్తంగా రాజస్థాన్ లో రాజకీయం రసకందాయంలోకి చేరింది.



Next Story