కేసీఆర్ కృషితో మూడేండ్లలోనే కాళేశ్వరం కల సాకారం

by  |
కేసీఆర్ కృషితో మూడేండ్లలోనే కాళేశ్వరం కల సాకారం
X

దిశ, రంగారెడ్డి: ఉద్యమ నాయకుడే పరిపాలన చేస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లోని నాదరుగుల్ చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాతృదేవోభవ ఆశ్రమాన్ని మంత్రి సందర్శించి.. 5 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పదేండ్లు పట్టే కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లల్లో పూర్తిచేయడం సీఎం కేసీఆర్ గొప్పతనమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 15 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు.

tag: sabitha indra reddy, comments, trs formation day, rangareddy


Next Story