- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: మొదటి రోజు హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ఉన్నత పాఠశాలకు
40 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గ్రామపంచాయతీ, జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు సమర్థవంతంగా చేపట్టారని అభినందించారు. పిల్లలను పేరెంట్స్ ధైర్యంగా పంపిస్తామన్నారని, డిఈవోలు, ప్రధానోపాధ్యాయులు గతంలో కన్నా ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన సమయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
డివోలు, ఎంఈఓ ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని చెప్పారు. 30 లక్షల మంది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని, పేరెంట్స్ నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులందరూ వ్యవహరించాలని సూచించారు. రెసిడెన్షియల్ తప్ప మిగతా పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఏడాది లక్ష ఇరవై వేల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చారని పేర్కొన్నారు. ఇంటర్ లో లక్షమంది వరకు పిల్లలు ప్రభుత్వ కాలేజీలో చేరారని, ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో రెండున్నర లక్షలకు పైగా విద్యార్థులు చేరారని పేర్కొన్నారు.